ప్రగతిభవన్లో బుధవారం ప్రభుత్వ ఉన్నతాధికారులు, మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశమాయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులకు మే నెల పూర్తిస్థాయి జీతాల చెల్లింపునకు సీఎం సూచనప్రాయంగా ఆమోదం తెలిపినట్టు సమాచారం. ఇక హైకోర్టు తీర్పు నేపథ్యంలో పెన్షనర్లకు కూడా కోతల్లేకుండా మొత్తం చెల్లించే యోచనలో సీఎం ఉన్నట్టు తెలిసింది. లాక్డౌన్ సడలింపులకు సంబంధించి కేంద్రం విడుదల చేసే మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్ర సర్కారు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
దేవాలయాలు, మసీదులు, చర్చిలు, మతపరమైన సంస్థల ప్రారంభానికి కొన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆ దిశగా నిర్ణయాలు తీసుకోకపోచ్చని తెలుస్తోంది. ఇక హైదరాబాద్లో మెట్రో రైలు సర్వీసులు, సీటీ బస్సు సర్వీసులపైనా సమావేశంలో చర్చించినట్టు తెలిసింది.
కోడెల గుండెపోటుకు ప్రభుత్వ ఒత్తిళ్లే కారణం: నక్కా ఆనందబాబు