యూపీలోని గోరఖ్ పూర్ సమీపంలో కుప్పలు తెప్పలుగా గబ్బిలాలు చచ్చిపడి ఉన్నాయి. ఈ దృశ్యాన్ని ప్రజలు, తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇక్కడికి సమీపంలోని బేల్ గాట్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో గబ్బిలాలు పడివుండటాన్ని చూసిన స్థానికులు, కరోనా కారణంగానే అవి మరణించాయని భావించారు. ఈ వార్త ఆ ప్రాంతంలో దావానలంలా వ్యాపించింది. కొందరు వెటర్నరీ అధికారులకు సమాచారం అందించగా హుటాహుటిన ఆ స్థలానికి వచ్చారు.
ఎండలు సగటుతోచాలా ఎక్కువగా వున్న కారణంగానే గబ్బిలాలు చనిపోయాయని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు డివిజనల్ ఫారెస్ట్ హెడ్ అవినాష్ కుమార్ వెల్లడించారు. ఉష్ణోగ్రత 46 డిగ్రీల వరకూ ఉందని, తాగేందుకు నీరు లేకనే అవి చనిపోయి వుండవచ్చని తెలిపారు. మృతి చెందిన గబ్బిలాలను తదుపరి పరీక్షల నిమిత్తం వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు పంపించామని తెలియజేశారు.