ఏపీ సీఎం జగన్ పై సీపీఐ నేత నారాయణ విమర్శలు గుప్పించారు. ప్రత్యేకహోదాను మోదీ కాళ్ళ దగ్గర జగన్ తాకట్టు పెట్టాడని నారాయణ విమర్శించారు. ఏపీ ప్రజలు ప్రత్యేక హోదాను మర్చిపోవాల్సిందే, మూడు రాజధానుల కాన్సెఫ్ట్ తో జాతీఐ స్థాయిలో జగన్ చులకనయ్యాడని మండిపడ్డారు. రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ మాదిరిగా జగన్ ఏడాది పాలన సాగిందని సీపీఐ నారాయణ విమర్శించారు.
చంద్రబాబు, వైఎస్ చేసిన దానిలో పది శాతం కూడా జగన్ చేయడం లేదని, రాజకీయ ప్రత్యర్థులను తొక్కేయటానికి జగన్ కసిగా పనిచేస్తున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వేదికను కూల్చటం ద్వారా జగన్ తన మార్క్ పాలనకు తెరతీశాడని, అమరావతిని రాజధానిగా ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్ సమర్థించారని అన్నారు. జగన్ పాలనపై ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని నారాయణ అన్నారు.