మరో మూడు నెలల్లో తెలంగాణ నుంచే కరోనా వాక్సిన్ వస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలోని జీనోమ్ వ్యాలీలోని ఔషధ సంస్థలు, కరోనాకు ఔషధాన్ని తెచ్చేందుకు శ్రమిస్తున్నాయని చెప్పారు. వారి కృషి ఫలిస్తే, ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లో కరోనా వాక్సిన్ తెలంగాణ నుంచే ప్రపంచానికి కూడా మన తెలంగాణ గర్వకారణంగా నిలుస్తుందన్నారు.
రాష్ట్రానికి చెందిన ‘బయోలాజికల్ ఈ’ నుంచి మహిమా దాట్ల, ‘శాంతా బయోటెక్’ ఎండీ వర ప్రసాద రెడ్డి ఇటీవల తనతో మాట్లాడారని, కేసీఆర్ తెలిపారు. వారంతా చాలా సీరియస్ గా వాక్సిన్ కోసం పరిశోధనలు సాగిస్తున్నారని అన్నారు. ఆగస్టుకే వాక్సిన్ వచ్చే అవకాశం ఉందని వరప్రసాద రెడ్డి తనతో చెప్పారని పేర్కొన్నారు.
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఈసీ పనిచేస్తోంది: ఎంపీ కనకమేడల