తెలంగాణలో నేటి నుంచి వైన్షాపులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి ఎక్సైజ్ అధికారులు, యజమానులు వైన్షాపుల ముందు సామాజిక దూరాన్ని పాటించే విధంగా క్యూలైన్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 40 రోజుల తరువాత వైన్స్లు తెరచుకోవడంతో మందుబాబులు తెల్లారకముందే వైన్స్ల వద్ద బారులు తీరారు.
కొండాపూర్లోని ఓ వైన్స్ ముందు మందుబాబులకు పోటీగా మందు బామలు కూడా ఉదయాన్నే వచ్చి లైన్లో నిల్చున్నారు. సామాజిక దూరం పాటిస్తూనే మొహాలకు మాస్కులతో అమ్మాయిలు మందు కోసం పడిగాపులు కాస్తున్నారు. సామాజిక దూరం పాటించే విధంగా పోలీసులు తగు చర్యలు చేపట్టారు.