ఇటీవల దేశవ్యాప్తంగా భారీ విగ్రహాల ఆవిష్కరణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీలోని సత్తెనపల్లిలో కూడా అదే తరహాలో భారీ విగ్రహం, అది కూడా ఎన్టీఆర్ ది ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా, గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తన నియోజకవర్గంలో అనేక అభివృద్ధి, సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సత్తెనపల్లి చెరువులో 36 అడుగుల ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు కోడెల తెలిపారు.
అలాగే చెరువుకు పక్కనే ఉన్న 7 ఎకరాల స్థలంలో పార్కును నిర్మించామన్నారు. ఇందుకోసం రూ.9 కోట్లు ఖర్చు అయ్యాయని పేర్కొన్నారు. ఈ పార్కు చుట్టూ జాతీయ నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేస్తామని కోడెల అన్నారు. దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువులో ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపించామనీ, ఈ నెల 18న విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని స్పీకర్ తెలిపారు.
కవిత ఓడిపోవడానికి ఫ్యాక్టరీ వివాదమే కారణం: జీవన్ రెడ్డి