కరోనా మహమ్మారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ ను ప్రకటించారు. సినీ సెలబ్రిటీలు కూడా ఈ పోరాటానికి మద్దతు తెలుపుతున్నారు. అటు బాలీవుడ్ మొదలు ఇటు దక్షిణాదికి చెందిన పలువురు ప్రముఖ హీరోలు, హీరోయిన్లు కరోనాపై అవగాహన కలిగిస్తున్నారు. మ్యూజిక్ వీడియోలు లాంటివి చేసి అందరికీ జాగ్రత్తలు చెబుతున్నారు. కాగా కరోనాపై మరింత అవగాహన పెంచేందుకు ఇప్పుడు ఓ షార్ట్ ఫిలింను చేశారు. ఫ్యామిలీ అనే పేరుతో రాబోతున్న ఈ లఘు చిత్రంలో చిరంజీవి, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, ప్రియాంక చోప్రా, రణ్బీర్ కపూర్, అలియా భట్తో పాటు తదితరులు భాగం అవ్వబోతున్నారు. ప్రసూన్ పాండే దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిలింలో బిగ్ బీ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇందులో ఇంట్లోనే ఉండటం, జాగ్రత్తలు తీసుకోవడం, సామాజిక దూరం పాటించడం, వర్క్ ఫ్రమ్ హోమ్, పరిశుభ్రతను పాటించడం తదితర విషయాలను వివరించనున్నారు. సోమవారం రాత్రి 9గంటలకు సోనీ నెట్వర్క్లో ఈ లఘు చిత్రం ప్రసారం కానుంది.
previous post
next post
ఇండస్ట్రీలో 50 శాతం పనికిరాని వాళ్లే… కరోనా వల్ల వాళ్ల శాతం తగ్గుతుంది… డైరెక్టర్ తేజ షాకింగ్ కామెంట్స్