telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సోనాక్షి సిన్హాపై “శక్తిమాన్” కౌంటర్…!?

Sonakshi

కోవిడ్-19ను అరికట్టడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు సెలెబ్రిటీలు తమ ఇంట్లోనే ఉంటూ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతున్నారు. కొంతమంది సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులకు వినోదాన్ని పంచుతున్నారు. మరోవైపు దూరదర్శన్‌లో ‘రామాయణ్’, ‘మహాభారత్’ ధారావాహికలను తిరిగి ప్రసారం చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ‘శక్తిమాన్’ ఫేమ్ ముఖేశ్ ఖన్నా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని, సోనాక్షి సిన్హా లాంటి వాళ్లకు ఈ సీరియళ్లు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ప్రస్తుత తరం కొత్త పోకడలకు ఎక్కువగా ఆకర్షితమవుతోందని, దాని మోజులో పడి మన ఇతిహాసాలు, చరిత్రను మరచిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ప్రోగ్రాంకు విచ్చేసిన సోనాక్షి సిన్హా రామాయణానికి సంబంధించిన ఓ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయిన సంగతి తెలిసిందే. అప్పట్లో సోషల్ మీడియాలో సోనాక్షిని నెటిజన్లు ఓ ఆట ఆడుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యువ నిర్మాత ఏక్తా కపూర్ ‘మహాభారత్’ ను పరిహాసం చేస్తూ సీరియల్స్ నిర్మించడం వంటి పలు అంశాలను ప్రస్తావించారు ముఖేశ్. ఇక దూరదర్శన్‌లో అప్పటి చిన్నారులు ఎంతగానో మెచ్చిన “శక్తిమాన్‌” సీరియల్‌ను కూడా తిరిగి ప్రసారం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Related posts