కరోనా నివారణ చర్యల్లో ఏపీ ప్రభుత్వం విఫలమైందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ…లాక్డౌన్ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో రోజురోజుకూ లాక్డౌన్ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. కేంద్ర లాక్డౌన్ నిబంధనలను వైసీపీ నేతలే తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు.
రైతుల వద్ద వెంటనే పంట ఉత్పత్తులు కొనుగోలు చేయాలని అన్నారు.ప్రతి పేద కుటుంబానికి రూ.5 వేల సాయం చేయాలని యనమల డిమాండ్ చేశారు. కరోనా విజృంభిస్తోన్న సమయంలో ఇసుక తవ్వకాలకు ఎలా అనుమతులు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. వైద్య సిబ్బందికి మాస్కులు, రక్షణ పరికరాలు ఎందుకు కొనుగోలు చేయడంలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు.