భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సంజనా గణేశన్ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే బుమ్రా.. పెళ్లి తర్వాత దానికి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు. సంజన గణేశన్తో కలిసి వివాహ వేడుక సమయంలో తీసుకున్న మరో రెండు ఫొటోలను బుమ్రా తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశాడు. ఇక్కడివరకు బాగానే ఉంది. అయితే బుమ్రా పంచుకున్న ఫొటోల్లో.. నూతన దంపతులు నడుచుకుంటూ వస్తుండగా ఇరువైపుల ఉన్నవారు బాణసంచా కాల్చడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఈ ఫోటోలపై నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బుమ్రా దీపావళి పండగ రోజున ఓ ట్వీట్ చేశాడు. అందరికి శుబాకాంక్షలు చెప్పి.. టపాసులు కాల్చొద్దని అభిమానులను కోరాడు. 2017లో బుమ్రా చేసిన ట్వీట్ను ఇప్పుడు నెటిజెన్లు షేర్ చేస్తూ అతడిపై మండిపడుతున్నారు. ‘బుమ్రా.. ముందుగా నువ్వు పాటించి! ఆ తర్వాత ఇతరులకు నీతులు చెప్పు’ అని ఒకరు కామెంట్స్ చేస్తున్నారు.
next post
కరోనా అనేది జబ్బే కాదని ప్రకటించిన ఏకైక సీఎం జగన్: కన్నా