telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

కరోనాపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు: గౌతమ్‌ సవాంగ్‌

apcm jagan give full powers to gowtam as dgp

కరోనా వైరస్‌పై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ప్రసార సాధనం అధికారిక ఉత్తర్వులు లేనిదే వార్తలు ప్రసారం చేయకూడదన్నారు. కోవిడ్‌-19ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక మహమ్మారిగా ప్రకటించిందన్నారు.

అసత్య వార్తలు ప్రచారం చేసి, భయాందోళనలు సృష్టించిన సదరు వ్యక్తికి ఏడాది జైలుతో పాటు జరిమానా విధించబడుతుందన్నారు. కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్స్‌-1995 చట్టం ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.

Related posts