telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లాక్‌డౌన్‌

rjasthan corona

కరోనా వైరస్ ను కట్టడిచేసేందుకు యావత్‌ దేశం యుద్దం చేస్తోంది. రెండు రాష్ట్రాలు మినహా దేశమంతటా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. సోమవారం రాత్రి వరకు 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. మిజోరం, సిక్కిం మాత్రమే ఈ విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దేశవ్యాప్తంగా 548 జిల్లాల్లో పూర్తిగా బంద్‌ కొనసాగుతోంది. పంజాబ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు.

దేశంలో కరోనా బాధితుల సంఖ్య 471కి చేరగా.. ఇప్పటిదాకా తొమ్మిది మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజే కొత్తగా 75 కేసులు నమోదవగా.. ఇద్దరు చనిపోయారు. ఇందులో ఒకరు బెంగాల్‌కు చెందిన వ్యక్తి కాగా మరొకరు హిమాచల్ ప్రదేశ్ వ్యక్తిగా గుర్తించారు.ప్రజలు బయటికి రాకుండా కఠిన ఆంక్షలు విధించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం స్పష్టం చేసింది. నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.

Related posts