ఆర్మీ ఆఫీసర్ గా నాడు తాను కన్న కలను సుప్రీం కోర్టు స్ఫూర్తిదాయక తీర్పుతో నిజం చేస్తోందని సినీ నటి, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి హర్షం వ్యక్తం చేశారు. సైన్యంలో తమకు కూడా కమాండింగ్ పోస్టులు ఇవ్వాలని మహిళా సైనికులు పోరాడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. మహిళలను కూడా సైన్యంలో శాశ్వత కమిషన్ ప్రాతిపదికన కమాండింగ్ పోస్టుల్లో నియమించాలని తీర్పు వెలువరించింది.
సుప్రీం కోర్టు తీర్పుపై విజయశాంతి స్పందిస్తూ 20 ఏళ్ల కిందట తాను ‘భారతరత్న’ అనే చిత్రంలో ఆర్మీ కమాండర్ పాత్ర పోషించానని, సుప్రీం కోర్టు తీర్పు ఇప్పుడా పాత్రను వాస్తవరూపంలోకి తెచ్చేలా ఉందని పేర్కొన్నారు. మహిళలు ఏ రంగంలోనైనా రాణిస్తారని, సైన్యానికి నాయకత్వం వహించి సఫలమవుతారనడంలో తనకు ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు విజయశాంతి ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.
బీజేపీ ఒక్క మున్సిపాల్టీ గెలిచినా కాలర్ ఎగరేసే పరిస్థితి: కేటీఆర్