telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ లో అదే నా లక్ష్యం అంటున్న స్మిత్…

గతంలో రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆడిన స్మిత్‌.. ఈ ఏడాది ఢిల్లీ తరఫున ఆడుతున్నాడు. ఐపీఎల్‌ 2021 వేలానికి ముందు రాజస్థాన్‌ స్మిత్‌ను వదిలేయడంతో అతన్ని ఢిల్లీ కొనుగోలు చేసింది. స్మిత్ అతని కనీస ధర రూ. 2.2 కోట్ల అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. తాజాగా స్టీవ్‌ స్మిత్‌ మాట్లాడుతూ ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు సభ్యులతో ఉన్న అనుభవాలను పంచుకున్నాడు. ‘ఢిల్లీ జట్టు వాతావరణం చాలా బాగుంది. ప్రస్తుతం ఢిల్లీకి మంచి జట్టు ఉంది. మేము ఐపీఎల్‌ ట్రోఫీని సాధించడం కష్టమే కాదు. చేయగల్గిన ప్రతీదాన్ని చేయడానికి ప్రయత్నిస్తాం. మా లక్ష్యం ట్రోఫీని సాధించడమే. మ్యాచులను గెలుచుకుంటూ వెళ్లడమే మా ప్రణాళిక. ఆటగాళ్లు విజయాలను ఎంజాయ్ చేస్తున్నారు. నా లక్ష్యం కూడా ఐపీఎల్‌ టైటిల్‌ను గెలవడమే’ అని స్మిత్ అన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఈ సీజన్‌లో ఇప్పటివరకూ రెండు మ్యాచ్‌లు ఆడిన స్టీవ్ స్మిత్‌.. పంజాబ్‌ కింగ్స్‌ జట్టుపై 9 పరుగులే చేసి నిరాశపరిశాడు. ఇక ముంబై ఇండియన్స్‌పై 33 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. మరో రెండు మ్యాచుల్లో స్మిత్ ఆడలేదు. ఇప్పటివరకు ఢిల్లీ నాలుగు మ్యాచులు ఆడగా.. మూడింట్లో నెగ్గింది.

Related posts