మహేష్ బాబు, అనీల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “సరిలేరు నీకెవ్వరు” చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం మహేష్ కు భారీ విజయాన్ని అందించింది. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మేజర్ అజయ్ కృష్ణ పాత్రని మహేష్ బాబు పోషించగా, ఆయనకి జతగా రష్మిక నటించింది. విజయశాంతి కీలక పాత్రలో మెరిసారు. ఈ సినిమా విడుదల తర్వాత ఫ్యామిలీతో కలిసి అమెరికా ట్రిప్ వేసిన సంగతి తెలిసిందే. టూర్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్న మహేష్ విహారయాత్రకి సంబంధించిన అప్డేట్స్ ట్విట్టర్ ద్వారా పంచుకుంటున్నాడు. నమ్రత కూడా తన ఇన్స్టాగ్రామ్లో పలు ఫోటోలు షేర్ చేస్తుంది. రీసెంట్గా మహేష్ ఫ్యామిలీ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. దాదాపు రెండు నెలలు ఈ ట్రిప్ కొనసాగనుందని తెలుస్తుండగా, ఈ వెకేషన్ ముగిసిన వెంటనే మహేష్ దర్శకుడు వంశీ పైడిపల్లి చిత్రంలో నటిస్తారు. ఈ మూవీని ఏడాది చివర్లో లేదా, వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
previous post
next post