telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఎంపీ శివప్రసాద్ చెల్లెలు.. వైసీపీలో.. !

mp sivaprasad sister in ycp

చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్ చెల్లెలు పద్మజ అనూహ్యంగా రాజకీయ తెరపైకి వచ్చారు. పూతలపట్టు నుంచి తమ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ను నిరాకరించిన వైఎస్ జగన్, పద్మజకు ఆ స్థానాన్ని ఖరారు చేశారు. వైసీపీ అధికార ప్రతినిధిగా ఉంటున్న పెద్దిరెడ్డి సహకారంతో పద్మజకు టికెట్ లభించినట్టు తెలుస్తోంది.

పూతలపట్టు నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు బరిలోకి ఉంటారన్న విషయం ఇంకా సస్పెన్స్ లోనే ఉంది. పలమనేరు మాజీ ఎమ్మెల్యే లలితకుమారికి మరో చాన్స్ రావచ్చని తెలుస్తోంది. గత ఎన్నికల్లో లలితకుమారిపై సునీల్ 624 ఓట్ల స్వల్ప ఆధిక్యతలో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Related posts