మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన స్పందిస్తూ తన వ్యక్తిగత ఆలోచనల మేరకే రాజీనామా చేశానని అన్నారు.గాంధీజీ వర్ధంతి సందర్భంగా గుంటూరు హిమని సెంటర్లో ఆయన విగ్రహానికి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శానసమండలి రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని తెలిపారు. పలు విషయాల్లో తమ పార్టీ ఆలోచన ఒకలా ఉందని, తన ఆలోచన మరోలా ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో నేను దూరంగా ఉండడమే మంచిదనిపించిందని వివరించారు.
ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోవాలంటే జనసేనను గెలిపించాలి: పవన్