గువాహటి వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. టాస్ అనంతరం స్టేడియంలో వర్షం కురుస్తుండటంతో అంపైర్లు మ్యాచ్ను తాత్కాలికంగా నిలిపివేశారు. గ్రౌండ్ సిబ్బంది పిచ్ను కవర్లతో కప్పి ఉంచారు. మ్యాచ్లో టాస్ గెలిచిన టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మరికొన్ని నిమిషాల్లో మ్యాచ్ ప్రారంభంకావాల్సి ఉండగా అకస్మాత్తుగా చిరుజల్లులు కురవడంతో ఆటను ఆపేశారు. దీంతో ఇరుజట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్లకు పరిమితమయ్యారు.