ఇప్పటి రాజకీయాలకు అమిత్ షా వంటి నేతలే సరైనవాళ్లని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.తిరుపతిలో న్యాయవాదులతో పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రికరణశుద్ధి ఉన్న న్యాయవాదులు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.
రాయలసీమను కొన్ని ముఠాలు కబ్జా చేశాయని ఆరోపించారు. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటివారికే ఇలాంటి వాళ్లు భయపడతారని వ్యాఖ్యానించారు. ఆయన ఉక్కుపాదంతో అణచివేస్తారన్న భయం వీళ్లకు ఉందని అన్నారు. సమస్యలపై సామాన్యుడి ఆవేదనే జనసేన అని పవన్ అభివర్ణించారు. అయితే తన నుంచి, తన పార్టీ నుంచి ఇప్పటికిప్పుడు అద్భుతాలు జరుగుతాయని ఆశించవద్దని స్పష్టం చేశారు. భావితరాల క్షేమం కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు.
జగన్ పరిపాలనకు తుగ్లక్ పరిపాలనకు దగ్గరి పోలికలు: అనూరాధ