ప్రజలు ఇంత గట్టిగా తీర్పు ఇచ్చినప్పటికీ చంద్రబాబుకు పశ్చాతాపం కలుగలేదని వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మండిపడ్డారు. ఈ రోజు ఆమె పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజల తీర్పును లెక్కలోకి తీసుకోవడంలేదని విమర్శించారు. ప్రపంచస్థాయి రాజధానిని నిర్మించానన్న భ్రమలో ఆయన ఉన్నారని విమర్శించారు.
రాజకీయాల్లో తనకు 40 ఏళ్ల అనుభముందంటున్న చంద్రబాబు, భూములిచ్చిన రైతులను కనీసం క్షమాపణలు కూడా కోరలేదని చెప్పారు. ప్రజలకు మంచి చేస్తే హారతులు పడతారు. చెడుచేస్తే రాళ్లువిసురుతారని ఆమె చెప్పుకొచ్చారు. భూములిచ్చిన రైతులు, రైతు కూలీలు నిరసన తెలిపితే.. వారిని మీరు ఉగ్రవాదులతో పోల్చారని ధ్వజమెత్తారు. అమరావతిలో గ్రాఫిక్స్ పై పెట్టిన ఖర్చును ప్రజల సంక్షేమానికి పెడితే వారు సంతోషపడేవారన్నారు.
భారత్పై మరోసారి అక్కసు వెళ్లగక్కిన ముషారఫ్