అతి కిరాతకంగా హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి కుటుంబ సభ్యులను తెలంగాణ గవర్నర్ తమిళిసై పరామర్శించారు. శంషాబాద్లోని నక్షత్ర కాలనీలోని వారి ఇంటికి వెళ్లిన గవర్నర్ వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గుండె నిబ్బరం చేసుకొని ధైర్యంగా ఉండాలనీ చెప్పారు. నిందితులకు కఠిన శిక్ష పడే వరకు పోరాడదామని ఆమె వారికి ఈ సందర్భంగా తెలిపారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన హంతకులపై కఠిన చర్యలు తీసుకుంటామని గవర్నర్ వారికి హామీ ఇచ్చారు.
ఈసీని నిందించడం సరికాదు.. చంద్రబాబుకు పురందేశ్వరి హితవు