మహారాష్ట్ర రాజకీయాల్లో ఎన్సీపీ నేత అజిత్ పవార్ వ్యూహాత్మకంగా వ్యవహరించి అలజడి సృష్టించారు. ఎన్సీపీకి షాక్ ఇస్తూ అజిత్ పవార్ బీజేపీతో కలవడంతో ఆయనను ఆ పార్టీలోంచి తొలగిస్తారన్న ప్రచారం జరిగింది. ఇదే విషయంపై ఆయనను మీడియా ప్రశ్నించగా ఆయన అసహనం వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అజిత్ పవార్ బయటకు వచ్చారు. మీరు ఇప్పటికీ ఎన్సీపీలోనే ఉన్నారా? అంటూ ఓ విలేకరి అడిగాడు. ‘ఎన్నిసార్లు చెప్పాలి, నేను ఇప్పటికే ఎన్సీపీలోనే ఉన్నాను, ఎన్సీపీతోనే ఉంటాను’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎన్సీపీ నుంచి నన్ను బహిష్కరించారని మీరెక్కడైనా విన్నారా? లేక చదివారా?’ అని అజిత్ పవార్ ప్రశ్నించారు. తాను ఎన్సీపీలోనే ఉన్నానని తేల్చిచెప్పారు.
సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే ఏపీ ప్రజలంతా ఔటే: కేఏ పాల్