సినీనటుడు సంపూర్ణేష్బాబుకు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం నుంచి సంపూర్ణేష్ బాబు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సిద్ధిపేట కొత్త బస్టాండ్ వద్ద బుధవారం ఈ ప్రమాదం జరిగింది. సంపూర్ణేష్ బాబు తన భార్య, పిల్లలతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా సిద్ధిపేట కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సంపూర్ణేష్, ఆయన భార్య, కూతురికి స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికులు పోలీసులకి సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు ఘటనా స్థలికి చేరుకొని సంపూ ఫ్యామిలీని ఆసుపత్రికి తరలించారు. ఇక సినిమాల విషయానికొస్తే… ఈ హీరో ఇటీవలే “కొబ్బరి మట్ట” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నాడు. సంపూర్ణేష్ బాబు సినిమాలలో హీరోగానే కాకుండా కొన్ని కీలకపాత్రలు కూడా పోషిస్తున్నారు.
previous post