telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

టీడీపీకి రాజీనామా చేసిన.. చందు సాంబశివరావు … బీజేపీ ఆకర్ష పనిచేస్తుండోయ్…

TDP Change Puthalapattu Candidate

ఏపీలో టీడీపీకి మరో నేత దూరం అవుతున్నాడు. గుంటూరు జిల్లాకు చెందిన ఆ పార్టీ నేత చందు సాంబశివరావు పార్టీకి రాజీనామా చేశారు. అధినేత చంద్రబాబుకు అత్యంత విధేయుడిగా పేరున్న సాంబశివరావు రాజీనామా నేతలకు షాక్‌కు గురిచేసింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాలో శాస్త్రవేత్తగా పనిచేసిన సాంబశివరావు 2004లో టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో గుంటూరు జిల్లా దుగ్గిరాల నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు.

టీవీ చర్చల్లో టీడీపీ వాణిని బలంగా వినిపించడంలో ముందుండే సాంబశివరావును ఎమ్మెల్సీని చేస్తారన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. చంద్రబాబు ఆయనకు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) డైరెక్టర్ పదవి ఇచ్చారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. చంద్రబాబుకు వీర విధేయుడిగా ఉన్న ఆయన తాజాగా తీసుకున్న నిర్ణయం పార్టీ నేతలను షాక్‌కు గురిచేసింది. త్వరలోనే ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం జోరుగానే జరుగుతోంది.

Related posts