మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఒక్కసారిగా శివసేన పార్టీ షాక్కు గురైంది. ఆ పరిణామాలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణం చేయడానికి శరద్ పవార్తో సంబంధం లేదన్నారు. మహారాష్ట్ర ప్రజలను అజిత్ పవార్ వెన్నుపోటు పొడిచినట్లు రౌత్ విమర్శించారు.
అజిత్ పవార్తో పాటు అతనికి సపోర్ట్గా ఉన్న ఎన్సీపీ ఎమ్మెల్యేలు.. శివాజీని, మహారాష్ట్రను అవమానించారన్నారు. అజిత్ పవార్ గత రాత్రి 9 గంటల వరకు తమతో భేటీలో ఉన్నారన్నారు. ఆ తర్వాత ఆయన అకస్మాత్తుగా మాయమైనట్లు చెప్పారు. అజిత్ ఆ భేటీలో కండ్లల్లో కండ్లు పెట్టి సూటిగా మాట్లాడలేదని రౌత్ విమర్శించారు.
అందరూ ఎన్టీఆర్ కావాలంటున్నారు …