ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తల్లి ఈశ్వరమ్మ(84) ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. గత నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె విశాఖపట్టణంలోని పినాకిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
ఈశ్వరమ్మకు మొత్తం 11 మంది సంతానం. వీరిలో ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. మంత్రి బొత్స సత్యనారాయణ పెద్ద కుమారుడు కాగా రెండో కుమారుడు అప్పల నరసయ్య ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. విజయనగరంలో నేటి మధ్యాహ్నం ఈశ్వరమ్మ అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
వలసలతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదు: కుంతియా