కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 5న ఉప ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ 13 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. అనర్హత వేటు పడ్డ 17మంది ఎమ్మెల్యేలను ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతిస్తూ నిన్న సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది.
రెండు స్థానాలకుసంబంధించిన పిటిషన్లపై కర్ణాటక హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆ స్థానాల్లో ఈసీ ఎన్నికలు నిర్వహించడం లేదు. బెంగళూరులోని కార్యాలయంలో 15 మంది కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలు ఇవాళ సీఎం యడియూరప్ప సమక్షంలో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.
కేసీఆర్ ఇంట్లో కుక్క చనిపోతే డాక్టర్లపై కేసులా ?: విజయశాంతి