telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు తన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి… గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటాలని ఇచ్చిన పిలుపునిచ్చారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఈరోజు మా జడ్చర్ల నియోజకవర్గం లోని 140 గ్రామాల్లో పార్టీ నాయకులు ప్రజాప్రతినిధుల బాగాసామ్యంతో 16116 మొక్కలను నాటడం జరిగింది అని… ఈ పుట్టినరోజు తనకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది అని తెలిపారు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చాలా అద్భుతంగా ముందుకు కొనసాగుతుందని తెలిపారు. పచ్చదనం పెంచడం కోసం ఈ చాలెంజ్ ఎంతో ఉపయోగకరంగా ఉంది అని అన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి అభినందనలు తెలియజేశారు. తన విజ్ఞప్తి మేరకు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మొక్కలు నాటిన TRS పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

Related posts