కేసీఆర్ ప్రభుత్వం డెడ్లైన్ విధించినా ఆర్టీసీ కార్మికులు తొణక లేదని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్కుమార్ అన్నారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవ పరిస్థితిని గుర్తించి కార్మికులతో చర్చించాలని కోరారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఓ మెట్టుదిగి వచ్చి కార్మికులతో చర్చలు జరపాలనిడిమాండ్ చేశారు. కార్మికుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో సమస్యకు పరిష్కారం చూపి జరుగుతున్న మరణాలను ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఎంపీ అన్నారు. కరీంనగర్ డిపో-2కు చెందిన ఆర్టీసీ కార్మికుడు కరీంఖాన్ గుండె నొప్పితో చనిపోవడం తీరని ఆవేదన మిగిల్చిందన్నారు.

