హుజూర్నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ భవన్ లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ గెలుపు ఆషామాషీ గెలుపు కాదని, ప్రజలు ఆలోచించి ఓట్లు వేశారని అన్నారు. ఉపఎన్నికలకు ముందు నిర్వహించాల్సిన సభకు ప్రతీకూల వాతావరణ పరిస్థితుల్లో నేను వెళ్లలేకపోయినప్పటికీ కూడా ప్రజలు అద్భుత మెజార్టీ ఇచ్చారన్నారు.
ప్రజల కోసం పాటుపడుతున్న ప్రభుత్వానికి ఈ గెలుపు ఓ టానిక్ లాంటిదని చెప్పారు. హుజూర్నగర్ ప్రజలు ఏఏ ఆశలు పెట్టుకుని టీఆర్ఎస్ను గెలిపించారో వందశాతం వాళ్ల కోరికలు తీర్చుతామని పేర్కొన్నారు.ఇంత అద్భుత విజయాన్ని అందించిన ప్రజల కోసం ఎల్లుండి హుజూర్ నగర్ లో కృతజ్ఞత సభ నిర్వహిస్తామని అన్నారు.


జగన్ అప్పుడే సీఎం అయ్యేవారు: నటి హేమ