కాంగ్రెస్ హయాంలో జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల దాడుల్లో 40 వేల మంది ప్రాణాలు కోల్పోయినా 370 అధికరణను ఎందుకురద్దు చేయలేదని బీజేపీ నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రశ్నించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈరోజు నవపూర్ లో ప్రచార సభలో షా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. జమ్మూకశ్మీర్ లో అధికరణ 370 రద్దును విమర్శిస్తున్న కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తిరిగి దాన్ని పునరుద్ధస్తామని చెప్పగలదా? అని సవాల్ విసిరారు.
ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ కి సవాల్ చేస్తున్నా.. అధికారంలోకి వస్తే అధికరణ 370ను పునరుద్ధరిస్తామని ప్రకటించే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా ? అని నిలదీశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనుంది. మహారాష్ట్రలో గెలుపు తమదే అని షా దీమా వ్యక్తం చేశారు.