ఏపీ లో ఇంటర్ మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు తెలుస్తోంది. ఇంటర్ కెమిస్ట్రీ ప్రశ్నాపతం లీకైన సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. పరీక్ష ప్రారంభానికి గంట ముందే ప్రశ్నాపత్రం బయటకు వచ్చిందని తెలుస్తోంది. జిల్లాలోని సత్తెనపల్లిలో పరీక్ష ప్రారంభానికి గంట ముందుగానే బయటకు వచ్చిన పేపర్ ను ఓ జిరాక్స్ సెంటర్ కు తీసుకెళ్లిన కొందరు దాన్ని జిరాక్స్ తీయిస్తుండగా పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు క్వశ్చన్ పేపర్ ను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. ఈ పేపర్ లీక్ పై విచారణ జరుపుతున్నామని, ఎవరు బయటకు తెచ్చారో తేలుస్తామని అన్నారు. ఈ విషయం అధికారులకు తెలియడంతో వెంటనే విచారణ ప్రారంభించారు. ఇంటర్మీడియట్ పరీక్షలు నేటితో ముగియనున్న సమయంలో ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న వార్తలతో విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా సమస్యలకు పరిష్కారం: చంద్రబాబు