సినీ నిర్మాత, సినీనటుడు, కమెడియన్ బండ్ల గణేష్ ఇటీవల రాజకీయాల్లో హడావుడి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బండ్ల గణేష్ తెలుగు తెరపైకి రీఎంట్రీ ఇచ్చాడు. మహేష్ నటిస్తున్న “సరిలేరు నీకెవ్వరు”లో కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా బండ్ల గణేష్తో పాటు అతని అనుచరులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ‘టెంపర్’ సినిమాకు సంబంధించి సినీ ఫైనాన్షియర్, సహ నిర్మాత పొట్లూరి వరప్రసాద్.. బండ్ల గణేష్కు రూ.30 కోట్లు పెట్టుబడి పెట్టారు. సినిమా విడుదల సమయంలో అసలు మొత్తాన్ని చెల్లించి.. మిగిలిన మొత్తానికి గణేష్ చెక్కులు ఇచ్చారు. మిగిలిన డబ్బును చెల్లించాలంటూ గణేష్ను పీవీపీ కోరారు. గణేష్కు సంబంధించిన కొంతమంది వ్యక్తులు పీవీపీ ఇంటికి వెళ్లి ఆయనపై బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో శుక్రవారం రాత్రి పీవీపీ పోలీసులకు ఫిర్యాదు చేయగా గణేష్తో పాటు అతని అనుచరులపై ఐపీసీ 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.ఆ తర్వాత ట్విట్టర్లో బండ్ల గణేష్ పీవీపీపై విరుచుకుపడ్డారు. తాజాగా మరోసారి వరుస ట్వీట్లతో పీవీపీపై బండ్ల గణేష్ విమర్శలు గుప్పించారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ లోక్సభ స్థానం నుంచి పీవీపీ పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ బండ్ల గణేష్ విమర్శలు గుప్పించారు.
కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో విజయవాడ నగర ప్రజలు ఎంత అదృష్టవంతులో నాకిప్పుడు అర్థమవుతుంది అమ్మో చిన్న పొరపాటు జరిగి ఉంటే ఘోరప్రమాదం జరిగిపోయేది🙏🏻
— BANDLA GANESH (@ganeshbandla) 5 October 2019
తొమ్మిదేళ్ల పాటు తన రక్తాన్ని పణంగా పెట్టి, తమ చెమటను చిందించి, రాత్రి అనక పగలు అనక కుటుంబానికి దూరంగా గడిపి చేజిక్కించుకున్న అధికారాన్ని, @YSRCParty @AndharaCMO
— BANDLA GANESH (@ganeshbandla) 5 October 2019
డే కి వర్కింగ్ డేకి, కాల్ షీట్ కు, మామూలు షీట్ కు, మేకప్ కి ప్యాకప్ కి తేడా తెలియని కొందరు స్కామ్ రాజాలు ఇండస్ట్రీని భ్రష్టుపట్టించారు.@YSRCParty @AndharaCMO
— BANDLA GANESH (@ganeshbandla) 5 October 2019
తీసిన ప్రతి హీరోతో గొడవే. ప్రతి డైరక్టర్ తో పంచాయతీనే. ప్రతి నటుడితో గొడవలే.మాట్లాడితే కోర్టులు, కేసలుు. ఇండస్ట్రీ కి హిట్ లు, బ్లాక్ బస్టర్లు ఇవ్వడం తెలుసు కానీ కోర్టుల చుట్టూ తిరగడం కొత్తగా నేర్పాడు ఈ స్కామ్ రాజా.@YSRCParty
— BANDLA GANESH (@ganeshbandla) 5 October 2019
, కొందరు దుర్మార్గులకు పెత్తనాలు ఇచ్చి, మీ కీర్తిని పాడు చేసుకోవద్దని గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్ గారికి నా వినయపూర్వక విన్నపం.🙏🏻@YSRCParty @AndharaCMO
— BANDLA GANESH (@ganeshbandla) 5 October 2019
, కొందరు దుర్మార్గులకు పెత్తనాలు ఇచ్చి, మీ కీర్తిని పాడు చేసుకోవద్దని గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్ గారికి నా వినయపూర్వక విన్నపం.🙏🏻@YSRCParty @AndharaCMO
— BANDLA GANESH (@ganeshbandla) 5 October 2019
ప్రపంచం, భారతదేశం మొత్తం గర్వించదగ్గ నటుడు, పద్మశ్రీ కమల్ హాసన్ గారినే కోర్టుకు లాగిన నీచ చరిత్ర నీది.@YSRCParty
— BANDLA GANESH (@ganeshbandla) 5 October 2019
ఆ ప్రముఖ దర్శకుడి బాగోతం త్వరలో బయటపెడతా… బిగ్ బాస్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు