తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందని ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడటంతో ఆ పార్టీ ఢీలపడిందన్నారు. తెలంగాణలో బీజేపీ బలపడుతోందని ఆయన చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సాధుజంతువులాంటి కాంగ్రెస్ ను చంపి, పులిలాంటి బీజేపీని బలపరిచారని విమర్శించారు.
సాంకేతికంతో తాను మరో నాలుగేళ్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేనేనని అన్నారు. బీజేపీలో చేరాలనుకుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే వెళ్తానని తెలిపారు. డిండి ప్రాజెక్టు భూసేకరణ నిధుల కోసం మంత్రి హరీశ్ రావును కలిశానని చెప్పారు. కాలేజీ రోజుల నుంచే హరీశ్ తనకు మంచి మిత్రుడని తెలిపారు.