telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఎన్నికల విధుల్లో పాల్గొని చనిపోతే రూ.50 లక్షలు ఇవ్వాలని కోరాం…

వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ అత్యవసర భేటీ అయ్యారు. ఎన్నికల విధుల నిర్వహణ విషయమై ఉద్యోగ సంఘల నేతలతో చర్చ నిర్వహించారు. ఈ భేటీ అనంతరం ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. స్థానిక ఎన్నికలు ఇప్పుడు జరిపితే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుందన్నా.. ఎస్ఈసీ ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపుతోందని చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. వ్యాక్సిన్ వేసుకోకుండా ఎన్నికల విధుల్లోకి వెళ్లబోమని అందరూ చెబుతున్నారని పేర్కొన్నారు. అటు ఎన్నికల విధులకు సహకరించాలని సీఎస్ కోరారని… వీలైనంత త్వరలో వ్యాక్సిన్ ఇస్తామని సీఎస్ హామీ ఇచ్చారని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొని కరోనా బారిన పడి చనిపోతే రూ. 50 లక్షలు పరిహరం ఇవ్వాలని కోరామని.. ఇప్పటికీ కరోనా భయం వెంటాడుతోందన్నారు. సీఎస్ ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల విధుల్లో పాల్గొంటామని స్పష్టం చేశారు. 

Related posts