ఢిల్లీలోని మెట్రో రైలు స్టేషన్లో దారుణం చోటుచేసుకుంది. ప్లాట్ఫాంపై నుంచి రైలు కోసం వేచి చూస్తున్న 40 ఏళ్ల మహిళ రైలు వస్తున్న సమయంలో దాని కిందికి దూకి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన సోమవారం ఝందేవాలన్ మెట్రో రైలు స్టేషన్లో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైలు కిందికి ఓ మహిళ దూకిందని ఫోన్ వచ్చిందని, వెళ్లి చూసేసరికే ఆమె ప్రాణాలు పోయాయని పోలీసులు తెలిపారు. ఆమె వివరాలు తెలియరాలేదని, పోస్టుమార్టం కోసం ఆమె మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు.
previous post
next post