ఖమ్మం జిల్లాలో మరో ప్రేమోన్మాది ఘాతుకం స్థానికంగా పెను సంచలనానికి దారి తీసింది. తనను ప్రేమిస్తూ వేరొక యువకుడితో చనువుగా ఉండటాన్ని సహించలేని ఓ యువకుడు.. యువతిని దారుణంగా హత్య చేశాడు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లిలో తేజస్విని (19) అనే యువతిని.. నితిన్ అనే యువకుడు అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.
నితిన్ తనను ప్రేమిస్తూ వేరే యువకుడితో చనువుగా ఉంటోందన్న కారణంగా ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. తేజస్వినిని హత్య చేసిన అనంతరం ఆమె మృతదేహాన్ని లంకపల్లిగుట్టల్లో పడేసి వెళ్లాడు. తేజస్విని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు నితిన్ను అదుపులోకి తీసుకుని కేసు విచారిస్తున్నారు.