telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీ సర్కార్‌… జనాలను సోమరిపోతులను చేస్తోంది

జనాన్ని సోమరిపోతుల్ని చేసేలా ఏపీ ప్రభుత్వం పని చేస్తోందని పరిటాల శ్రీరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల ద్వారా బెదిరించి.. ఎన్నికల్లో గెలిచారని ఫైర్‌ అయ్యారు అనంతపురం జిల్లాలో కలెక్టర్ ను తిట్టేవారున్నారు.. అదే కలెక్టర్ పేరుతో వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. ముచ్చిరామిలో వైసీపీ వేధింపులు తాళలేక రైతు ఆత్మహత్యాయత్నం చేశాడని.. రాప్తాడు నుంచి పెనుకొండ వరకు హైవేలో రియల్ దందా సాగుతోందని ఫైర్‌ అయ్యారు. చెన్నే కొత్తపల్లి తహసీల్దార్ ఆఫీస్ శివారెడ్డి డాబాలో ఉందని.. మీరు చేసే అరాచకాలు ప్రతిదానికి లెక్క ఉంటుందన్నారు. దీనికి వైసీపీ నేతలు, అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. చెన్నేకొత్తపల్లిలో కొందరు వైసీపీ తాగుబోతులు వచ్చి గొడవలు పడ్డారని… ప్రభుత్వం వచ్చిన తరువాత ఇప్పటి వరకు 6 కేసులు పెట్టారని మండిపడ్డారు. మీ తాటాకు చప్పుళ్లకు, కేసులకు భయపడేది లేదని.. రాప్తాడులో వైసీపీ చేసే అరాచకాలకు భయపడే ప్రసక్తే లేదని సవాల్‌ విసిరారు పరిటాల శ్రీరాం.

Related posts