ఏపీ రాజధాని నిర్మాణం విషయంలో గతంలో బీజేపీ, జనసేన నేతలు ఏం మాట్లాడారో గుర్తు తెచ్చుకోవాలని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నాలుగు రాజధానుల విషయం తనకు తెలియదని, ఈ విషయమై టీజీ వెంకటేష్ను అడగాలని ఆయన కోరారు. రాజధాని భూ అక్రమాలపై తమ వద్ద పూర్తి సమాచారం ఉందని ప్రభుత్వం స్పష్టం చేశారు.
రాజధానిలో తనకు భూములే లేవని ఓ మాజీ కేంద్ర మంత్రి ప్రస్తుత ఎంపీ చెబుతున్నాడని సవాల్ విసిరితే అన్నీ బహిర్గతం చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిలో భూ అక్రమాలపై తన వద్ద సమాచారం ఉందన్నారు. సరైన సమయంలో ఈ సమాచారాన్ని బయటపెడతానని ఆయన చెప్పారు. భారీ వర్షం వస్తే అమరావతి నీట మునిగే అవకాశం ఉందని తేలిందన్నారు.11 లక్షల క్యూసెక్కుల కంటే ఎక్కువ వరద వస్తే ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు. రాజధాని భూముల రైతులు కౌలు కోసం తనను కలిసినట్టుగా ఆయన పేర్కొన్నారు.