అమరావతి ప్రాంత ప్రజలపై జగన్కు ఎందుకంత కోపం అని టీడీపీ నేత దేవివేని ఉమా ప్రశ్నించారు. సోమవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఇంటిని, అమరావతిని ముంచాలని ప్రభుత్వం చేసిన కుట్రకు ప్రజలు తీవ్రంగా నష్టపోయారని మండిపడ్డారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పిదం వల్లే నేడు రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ధ్వజమెత్తారు.
అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన సీఎం.. వరద గురించి కనీసం పట్టించుకోకుండా ఢిల్లీకి వెళ్లారని విమర్శించారు. గోదావరి, కృష్ణా వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం కనీసం సమీక్ష కూడా చేయలేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వరదల మానిటరింగ్లో ఉద్దేశపూర్వకంగా నష్టం చేశారని ఆరోపించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 304 టీఎంసీలు నీరు సముద్రంలోకి వృధాగా వెళ్లిందన్నారు. అయినా రైతాంగానికి నీరు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. బ్యారేజీ వద్ద పడవను తీయడానికి ప్రభుత్వం ఆపసోపాలు పడిందని ఎద్దేవా చేశారు.
మంత్రివర్గ నిర్ణయాలు తప్పని చట్ట సభలో రుజువైంది: యనమల