మూలిగే నక్క పై తాటికాయ పడ్డట్టుగా ఏపీ కాంగ్రెస్ పరిస్థితి తయారైంది. ఇప్పటికే ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పటికే సీనియర్లు పార్టీలు మారుతున్న నేపథ్యంలో తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిపై మండిపడ్డారు. కాంగ్రెస్ని జీరో చేసిన రఘువీరానే పార్టీ నుంచి పంపించాలన్నారు. రఘువీరారెడ్డి నియంతలావ్యవహారించడం వల్ల కాంగ్రెస్ పార్టీ సర్వ నాశనం అవుతోందని అన్నారు.
ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో విభేదాల కారణంగా బైరెడ్డి రాజీనామా సమర్పించారు. రెండ్రోజుల్లో ఏ పార్టీలో చేరేదో చెబుతానని బైరెడ్డి రాజశేఖరరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిపై మండిపడ్డారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బాగుందని రాహుల్కి రఘువీరా తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ఫండ్ను కొట్టేయాలని రఘువీరా చూస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
సంయమనంతో మాట్లాడాలి.. బొత్సకు పవన్ హితవు