విద్యార్థుల చదువు ఇలా ఉంటే ఎలా పాసవుతారని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు టీచర్లను ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా కందిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఆయా సబ్జెక్టులలో విద్యార్థులకు మంత్రి ప్రశ్నలు వేశారు. తెలుగులో సరిగా పేర్లు కూడా రాయలేకపోవడంతో మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.
విద్యార్థులు ఎక్కాలు చెప్పలేకపోవడంతో ఈచదువులతో ప్రపంచంతో ఎలా పోటీపడతారని ప్రశ్నించారు. టీవీలు, సెల్ ఫోన్లు పక్కన పెట్టాలని, పదో తరగతి ఫలితాలలో కంది పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు, విద్యార్థులకు సూచించారు. పాఠశాల సమస్యలపై నివేదిక రూపొందించి తనకు అందజేయాలని ఆదేశించారు.
దోచుకున్నది దాచుకోవడానికే జగన్ స్విట్జర్లాండ్ వెళ్లారు: ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్