కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ మోసపూరిత పార్టీ అని..టీఆర్ఎస్ పార్టీకి ఓటు అమ్ముకోవద్దు అని అన్నారు. వరంగల్ పట్టణ అభివృద్ది కోసం తండ్రి కొడుకులు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. అదే వరంగల్ నగర అభివృద్ది కోసం నరేంద్ర మోడీ ఎన్నో నిధులు కేటాయించి సుందరీకరించిన ఘనత కేవలం బిజెపి ప్రభుత్వానికి చెందుతుందన్నారు. అమృత, స్మార్ట్ సిటీ, 550 కోట్ల నిధులతో రింగ్ రోడ్డు పనులను ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే చేశారని గుర్తు చేశారు. తండ్రి-కొడుకులు.. ఇక్కడ ఉన్న అవినీతి పరులకు వరంగల్ ను అప్పగించారు..ఇక్కడ ఉన్న ప్రజా ప్రతినిధులు భూ కబ్జా దారులు అని ఫైర్ అయ్యారు. వరంగల్ పట్టణ అభివృద్ది కోసం టీఆర్ఎస్ నాయకులు ఏం చేశారు అని విమర్శించారు. రైల్వే వ్యగన్ ఏర్పాటు కోసం భూమి కూడా ఇవ్వలేని టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయద్దని తెలిపారు. ఎయిర్ పోర్ట్ ఏర్పాటు కోసం భూసేకరణ కూడా చేయని చేతగాని ప్రభుత్వం.. టీఆర్ఎస్ ప్రభుత్వం అని విమర్శించారు.
previous post
next post
వల్లభనేని వంశీ వర్సెస్ టీడీపీ.. పెరుగుతున్న మాటల యుద్దం!