telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

యువత సెల్ ఫోన్ వ్యసనానికి బానిస కాకూడదు: హరీశ్ రావు

Ryathu bandhu amount Rs. 10000 in future

యువత సెల్ ఫోన్ వ్యసనానికి బానిస కాకూడదని సిద్దిపేట ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. టెక్నాలజీని మంచి కోసమే వాడాలని హితవుపలికారు. సిద్దిపేట రూరల్ మండలం ఇరుకోడ్ గ్రామంలో రెడ్డి సంక్షేమ భవనం, రజక, గౌడ సంఘ భవనాలు, లైబ్రరీ, ఎస్సీ మాదిగ కమ్యూనిటీ హాల్‌ను హరీశ్ రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచాక ఐదేళ్ల పాటు ప్రజల మధ్య ఉండి పనిచేసేవాడే నాయకుడని తెలిపారు. అంతేతప్ప ఎన్నికలప్పుడేప్రజల ముందుకు వచ్చేటోడు నాయకుడు కాదని పేర్కొన్నారు. యోజకవర్గంలో త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని చేపడతామని పేర్కొన్నారు. అలాగే ఇరుకోడ్ లో పశువుల ఆసుపత్రి, శ్మశానవాటిక నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

Related posts