తెలంగాణలో గత సోమవారం నిర్వహించిన శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం ఉదయం గుత్తా సుఖేందర్రెడ్డితో మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, నిరంజన్రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కార్యదర్శి హాజరయ్యారు.
శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ గడువులోపు ఎవరు నామినేషన్లు ధాఖలు చేయకపోవడంతో సుఖేందర్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వీ నర్సింహాచార్యులు గత సోమవారం అధికారికంగా ప్రకటించారు. అనంతరం గుత్తాకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
జగన్ అవినీతి ఆరోపణల పై లక్ష్మీనారాయణ క్లారిటీ!