జమ్మూకశ్మీర్ విషయంలో ప్రధాని మోదీ ఏకపక్ష నిర్ణయాలను తీసుకున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. ప్రజల అభిప్రాయాలను ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పారు. జమ్మూకశ్మీర్ అంశాన్ని బీజేపీ పెద్ద సమస్యగా భావించకపోయి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.
ఆరెస్సెస్ అభిప్రాయాల పట్ల మోదీకి గౌరవం లేదని అన్నారు. రిజర్వేషన్లపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ సున్నితమైన అంశాలపై అందరి అభిప్రాయాలను తెలుసుకోవాలనేది భగవత్ అభిప్రాయమని చెప్పారు. ఆరెస్సెస్ విధాలను మోదీ అనుసరించడం లేదని అన్నారు.