కుటుంబసభ్యులకు అందుబాటులోకి వచ్చిన జోగు రామన్న
తెలంగాణ మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సోమవారం రాత్రి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కేబినెట్ లో బెర్త్ దక్కని కారణంగానే జోగు రామన్న కుటుంబసభ్యులకు కూడ చెప్పకుండానే వెళ్లిపోయాడని ప్రచారం సాగింది. ఈ విషయమై కుటుంబసభ్యులతో పాటు, పార్టీ క్యాడర్ కూడ తీవ్రంగా ఆందోళన చెందింది. దీంతో జోగు రామన్న కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.
కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన ప్రకటించారు. కేబినెట్ లో చోటు దక్కని కారణంగానే జోగు రామన్న అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా ప్రచారం సాగింది. కానీ, ఈ విషయమై రామన్న స్పస్టత ఇచ్చారు. అనారోగ్యం కారణంగానే తాను అందుబాటులో లేకుండా వెళ్లిపోయినట్టుగా ఆయన సమాచారం ఇచ్చారు.
మోదీతో రాజీనామా చేయించాలని వాజ్పేయి భావించారు: యశ్వంత్ సిన్హా