telugu navyamedia
సినిమా వార్తలు

రష్మిక మందన్నపై నిర్మాతలు ఫైర్

Rashmika

“ఛలో” సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేసులో దూసుకెళ్తోంది. విజయ్ దేవరకొండ సరసన “గీతగోవిందం” సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో బిజీగా గడుపుతోంది. తెలుగులో మహేష్ తో ‘సరిలేరు నీకెవ్వరు’, నితిన్ తో ‘భీష్మ’ సినిమాలు చేస్తోన్న ఈ బ్యూటీ తమిళంలో కార్తీతో ఓ సినిమా చేస్తోంది. దర్శకుడు భాగ్యరాజ కన్నన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ‘ఖాకీ’ సినిమా తరువాత మంచి హిట్ కోసం ఎదురుచూస్తోన్న కార్తి ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. కొద్దిరోజులుగా ఎలాంటి హడావిడి లేకుండా సినిమా షూటింగ్ ని నిర్వహిస్తున్నారు. ఇంకా టైటిల్ ని ప్రకటించలేదు. అయితే అనుకోకుండా రష్మిక సోషల్ మీడియా ద్వారా టైటిల్ ని బయటపెట్టేసింది. తాజాగా చిత్రీకరణ పాల్గొన్న రష్మిక ‘సుల్తాన్’ షూటింగ్ లో నాల్గవ రోజు అంటూ టైటిల్ చెప్పేసింది. తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో తనకు తెలియకుండానే టైటిల్ రివీల్ చేసేసింది. ఈ విషయం కాస్తా యూనిట్ కి తెలిసిపోయింది. అధికారికంగా టైటిల్ ప్రకటించడానికి ప్లాన్ చేసుకున్న చిత్రయూనిట్ కి రష్మిక ఈ విధంగా షాక్ ఇచ్చింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను, టైటిల్ ను భారీ స్థాయిలో విడుదల చేయాలని దర్శకుడు భాగ్యరాజ్ కన్నన్, నిర్మాతలు భావించారు. అందుకు ఓ ఈవెంట్ నిర్వహించాలని కూడా అనుకుంటున్న వేళ రష్మిక ఇలా చేయడంతో నిర్మాతలు ఆగ్రహానికి గురైనట్లు సమాచారం.

Related posts