తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై నిన్న టీసీఎల్పీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రంలో పలువురు నేతలు పాల్గొనగా సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాత్రం పాల్గొనలేదు. ఈ విషయమై జగ్గారెడ్డిని ప్రశ్నించగా దీని గురించి పీసీసీ తనను అడిగిందని చెప్పారు. తనకు కొన్ని వ్యక్తిగత అభిప్రాయాలు ఉన్నాయని చెప్పానని అన్నారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు అనుగుణంగా పని చేస్తానని జగ్గారెడ్డి తెలిపారు.
పార్టీ ఫిరాయింపులపై నిరసన చేపట్టడం పార్టీ నిర్ణయం కాదని అది టీసీఎల్పీ నిర్ణయం అని అన్నారు. గతంలో తాను కూడా రెండు సార్లు పార్టీ మారానని అందుకే పార్టీ ఫిరాయింపులపై చేపట్టిన నిరసనలో పాల్గొనలేకపోతున్నానని తెలిపారు. ఈ విషయం సీఎల్పీ భట్టి విక్రమార్కకు చెప్పానని అన్నారు. అందుకు ఆయన కూడా కాదనలేకపోయారని కెఃప్పుకొచ్చారు. వ్యక్తిగత అభిప్రాయాలను ఎవరూ చంపలేరని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.