telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నాన్న జీవిత విశేషాలపై అమ్మ పుస్తకం రాసింది: వైఎస్ షర్మిల

shamila ycp

మాజీ సీఎం దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 71వ జయంతి సందర్భంగా విజయమ్మ రాసిన ‘నాలో.. నాతో వైఎస్సార్’ పుస్తకాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైఎస్‌ షర్మిల మాట్లాడుతూ… ‘నాన్న జీవిత విశేషాలపై అమ్మ రాసిన పుస్తకమే “నాలో.. నాతో వైఎస్సార్‌‌” అని తెలిపారు. ‘నాన్నకు సంబంధించిన విశేషాలను ఈ పుస్తకంలో కొత్త కోణంలో తెలుసుకోవచ్చని తెలిపింది.

తనకు మాత్రమే తెలిసిన నాన్నలోని కోణాన్ని తెలుపుతూ అమ్మ ఈ పుస్తకం రాసింది. ఈ విధంగా నాన్నను లోకానికి కొత్తగా పరిచయం చేసింది. ఈ పుస్తకం చదువుతున్నంత సేపు అమ్మ, నాన్నలతో కలిసి ప్రయాణం చేస్తున్నట్లు అనిపించిందిని షర్మిల పేర్కొన్నారు.నిజం చెప్పడం సులభం కాదు .. అయినప్పటికీ ధైర్యంగా అమ్మ నిజం చెప్పిందన్నారు. ఈ పుస్తకంలో నాన్నకు సంబంధించిన అన్ని విషయాలను తెలిపిందని షర్మిల పేర్కొన్నారు.

Related posts